Sunday, December 20, 2009

పాహి రామచంద్రప్రభో

ఆరభి రాగము త్రిశ్రనడ

పల్లవి..పాహి రామచంద్రప్రభో పలుకవేమిరా
కనికరించి నాదరికి కదలిరావదేలరా

నిరతము నీ నామమునే మదిని తలచు చుంటినిరా
నీవే నా దైవమ్మని నిన్ను కొలచు చుంటినిరా
సత్యవ్రతుడవు నీవని సకలము నీ కెరుకయని
హితులకు సన్నిహితులకు హితము కలుగ చేయుచుంటి

అడుగులకే మడుగులొత్తు అనుజుండే లక్ష్మణుండు
అహరహమును ప్రీతితోడ పులకరించు హనుమన్న
సాధ్వి సీత సపర్యలు సమ్మోహన పరచుచుండు
సకల జనుల సన్నుతుడవు యేమని నుతియింతునురా

రచన : కొడవంటి సుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment